Tirumala: ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

Read Time:  1 min
Tirumala: ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు
FONT SIZE
GET APP

తిరుమలలో(Tirumala) గత మూడురోజులుగా టిటిడి (TTD) దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు సోమవారంనాడు ఆస్థాన మండ‌పంలో ఘనంగా ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, మాన‌వ జీవ‌న విధానంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు పూర్వ‌జ‌న్మ క‌ర్మ ఫ‌ల‌మే కార‌ణ‌మ‌న్నారు. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టానికి మహాత్ముల‌ను సంద‌ర్శించి వారి మార్గ‌ద‌ర్శ‌కంలో భ‌గ‌వంతుడిని సేవించ‌డం ద్వారా మోక్షం పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

Read Also: Andhra Pradesh: రైతులకు శుభవార్త: పశువుల బీమా పథకం అమలు

Tirumala: ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు
The Purandara Dasa Aradhana celebrations concluded grandly.

ఆయన తన జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం సాక్షాత్తు నారద స్వరూపులైన పురందరదాసుల వారికే సాధ్యమైందని తెలిపారు. (Tirumala) పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.