हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఇక ఏక్కడైనా సెల్ ఫోన్ సిగ్నల్

Sudheer
ఇక ఏక్కడైనా సెల్ ఫోన్ సిగ్నల్

ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదా వీడియో కాల్ ద్వారా ఆత్మీయులను పలకరిద్దామని చూస్తే సిగ్నల్ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో అయితే సిగ్నల్ కోసం కొండలు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు, గిరిజన గ్రామాలకు కూడా సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా సహా పలు ప్రాంతాల్లో 4జీ సెల్ టవర్ల నిర్మాణం ప్రారంభమైంది. తొలిదశలో పార్వతీపురం, సీతంపేట, కురుపాం, భామిని వంటి మండలాల్లో 190 గ్రామాలకు టవర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొండప్రాంతాల్లో టవర్ల నిర్మాణం సవాళ్లతో కూడి ఉంది. నిర్మాణ సామాగ్రిని తరలించడం కష్టతరంగా మారింది. అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మట్టి రోడ్లు నిర్మించి టవర్ల సామాగ్రిని తరలిస్తున్నారు. ఈ కష్టాలను దాటుకుని కొన్ని చోట్ల టవర్ల నిర్మాణం పూర్తవ్వగా, మిగతా ప్రాంతాల్లో వేగంగా పనులు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 2,305 కొత్త 4జీ సెల్ టవర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ సహా జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. ఇవి పూర్తయితే 5,423 మారుమూల గ్రామాలకు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యలు త్వరలో చరిత్రగా మిగిలిపోవచ్చు. టవర్ల నిర్మాణంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఆర్థిక, విద్యా, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తేనున్నాయి. ఈ చర్యలతో నూతన సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావడమే కాకుండా, డిజిటల్ యుగంలో అందరూ భాగస్వాములవుతారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870