हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Sanjanna : కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య

sumalatha chinthakayala
Sanjanna : కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య

Sanjanna : కర్నూలు రాజకీయ విభేదాలు హత్యకు దారి తీశాయి. సంజన్న అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు. ఎన్నికల టైంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. రాజకీయంగా ఇద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంజయ్ కుటుంబంతో రామాంజనేయులు(అంజి) కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయ విభేదాలు ఉన్నాయి. సంజయ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయుడు అయితే అంజి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గీయుడు. కాటసానితో పొసగడం లేదని ఎన్నికల టైంలో సంజన్న టీడీపీలో చేరారు. మూడు నెలల క్రితం అంజి, సంజన్న మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవ కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 కర్నూలులో టీడీపీ నేత దారుణ

మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు దాడి

ఇప్పటికే అంజిపై హత్య కేసులు ఉన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు గ్రామంలో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. సంజన్న భార్య గతంలో వైసీపీ కార్పొరేటర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు జయరాం కార్పొరేటర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. సంజన్న బైరెడ్డి శబరి వర్గీయుడు. అంజి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వర్గీయుడు. సంజన్న రాత్రి 9 గంటల సమయంలో మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన అంజి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన సంజన్నను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సంజన్న చనిపోయాడు. చాలా కాలం తర్వాత ఇలాంటి హత్య కర్నూలు లో జరగడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉంటున్న సీమలో జరిగిన హత్యతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.కాగా,

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870