हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Sudhakar Yadav: జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్సై సుధాకర్ – వీడియో వైరల్!

Ramya
Sudhakar Yadav: జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్సై సుధాకర్ – వీడియో వైరల్!

పోలీసు గౌరవాన్ని కించపరచే వ్యాఖ్యలపై ఎస్సై ధీటైన ప్రతిస్పందన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “పోలీసు యూనిఫాం అరటితొక్క కాదు ఊడిపోవడానికి” అంటూ ఖండించారు. ఒక వీడియో ద్వారా స్పందించిన సుధాకర్ యాదవ్, పోలీసుల గౌరవాన్ని తుంచేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. వేల మంది పోటీదారుల్లో విజయం సాధించి, కఠినమైన శిక్షణ పొందిన తర్వాతే ఈ యూనిఫాం వేసుకున్నామని, అది తమ గౌరవానికి ప్రతీక అని చెప్పారు. తాము చట్టబద్ధంగానే పనిచేస్తామని, అడ్డదారులు తొక్కమని స్పష్టం చేశారు. ఇటువంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నమని, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయవచ్చని ఆయన హెచ్చరించారు.

యూనిఫాం వేసుకునేందుకు పడిన కష్టం తెలుసా?

తాము వేలమంది అభ్యర్థుల్లో పోటీ పరీక్షలు ఎదుర్కొని, కఠినమైన శిక్షణను పూర్తిచేసి ఈ పదవికి వచ్చామని రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. పోలీసులు వేసుకునే యూనిఫాం కేవలం బట్ట కాదు, అది కష్టానికి గుర్తు, తమ గౌరవానికి ప్రతీక అని వివరించారు. ‘‘నిజాయతీగా చదివి, మెరిట్‌ మీద పాస్‌ అయ్యి, పరుగు పందెంలో గెలిచి వేసుకున్న యూనిఫాం ఇది. దాన్ని ఊడదీస్తానంటావా?’’ అంటూ జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పట్ల ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం అత్యంత బాధాకరమన్నారు. తాము ప్రజల కోసం నిజాయతీగా పని చేస్తున్నామని, అడ్డదారులు తీసుకోవడం తమ విధేయతకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీయవచ్చని హెచ్చరించారు.

చట్టబద్ధంగా జరిగిన ఎంపీపీ ఎన్నికలో ఆరోపణలు అవాస్తవం

గత నెలలో రామగిరిలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పోలీసులు పూర్తి చట్టబద్ధతతో వ్యవహరించారని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు వందలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అయినప్పటికీ, ఎంపీటీసీలను రామేశ్వరం తరలించడం ద్వారా ఎన్నికలు వాయిదా పడేలా కుట్రపూరితంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై ఘాటైన దాడి అని అభివర్ణించారు. ప్రజల ఓటు హక్కును కాలరాసే ఈ విధమైన చర్యలు నిరసనీయమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్నారు.

ప్రజాస్వామ్యంపై ముప్పు.. భరోసా అవసరం

జగన్‌ శిష్యులు తుపాకులు ఉన్నాయి, ఎవరొస్తారో రావాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్సై ఆరోపించారు. కిందిస్థాయి ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తే, ప్రజాస్వామ్యం ముప్పులో పడతుందన్నారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుధాకర్ యాదవ్, పోలీసు విభాగానికి భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల పట్ల గౌరవం ఉండాలని, అలా ఉండేంత వరకూ తాము వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.

READ ALSO: ChandrababuNaidu: P-4 చైర్మన్‌గా చంద్రబాబు వైస్‌ చైర్మన్‌గా పవన్‌ కల్యాణ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
0:54

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.

వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.

ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

MGNREGA పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

MGNREGA పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ

నెల్లూరుకు ORR అవసరం లేదని మంత్రి స్పష్టం

నెల్లూరుకు ORR అవసరం లేదని మంత్రి స్పష్టం

తిరుమల ఘాట్ రోడ్డులో కొత్త ప్రయాణ నియమాలు

తిరుమల ఘాట్ రోడ్డులో కొత్త ప్రయాణ నియమాలు

శ్రీశైలంలో 12వ తేదీ నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో 12వ తేదీ నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

భోగి మంటలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు

భోగి మంటలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

📢 For Advertisement Booking: 98481 12870