దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్గా వ్యవహరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తో పాటు పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు (CSలు) ఈ కేసులో సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. వీరు రాష్ట్రాల తరఫున సమర్పించాల్సిన అఫిడవిట్లు ఆలస్యంగా దాఖలైనందుకు క్షమాపణలు కోరారు. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు.
Read Also: Jaipur Accident: జైపూర్లో మరో ఘోరమైన రోడ్డు ప్రమాదం.10 మంది మృతి
సుప్రీంకోర్టు (Supreme Court) ముందు హాజరైన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, తాము ఇప్పటికే అక్టోబర్ 29న అఫిడవిట్ సమర్పించామని తెలిపారు. రాష్ట్రంలో వీధికుక్కల నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై వివరాలు అందజేశామని చెప్పారు.

అదే సమయంలో ఇతర రాష్ట్రాల CSలు కూడా తమ తమ ప్రభుత్వాలు చేపట్టిన చర్యల గురించి కోర్టుకు వివరించారు. తాము Oct 29నే అఫిడవిట్ ఇచ్చామని AP CS తెలిపారు. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా స్ట్రే డాగ్స్ కోసం ఛార్ట్ రూపొందించాలని అమికస్ క్యూరీకి SC సూచించింది. కాగా కేసులో కుక్కకాటు బాధితులను ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: