
శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళుతున్న భక్తులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. నల్లమల అటవీ మార్గంలో వారికి ఏకంగా ఓ పెద్దపులి ఎదురుపడింది. మార్కాపురం జిల్లా (Markapuram District) డోర్నాల మండలం పరిధిలోని పెద్దచెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Read Also: Andhra Pradesh: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
మల్లన్న దయవల్లే ప్రమాదం జరగలేదంటున్న భక్తులు
శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న భక్తుల దారి పక్కన పొదల్లో పెద్దపులి కనిపించింది. కొద్దిసేపు భక్తులను తీక్షణంగా చూస్తూ అక్కడే నిలబడింది. అటవీశాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్న భక్తులు, భయంతో పరుగులు తీయకుండా నిల్చుండిపోయారు. ఇరువైపులా నిశ్శబ్దం నెలకొనగా, క్షణక్షణం ఉత్కంఠగా గడిచింది.
కొంతసేపటికి ఆ పులి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.(Srisailam) ‘శ్రీశైలం మల్లన్నే కాపాడాడు’, ‘ఓం నమశ్శివాయ’ అంటూ భక్తితో నినాదాలు చేస్తూ తమ యాత్రను కొనసాగించారు. ఈ ఘటనను ఓ వాహనదారుడు తన సెల్ఫోన్లో వీడియో తీశారు. అన్నదాన శిబిరానికి సరుకులు తీసుకెళుతున్న ఆయన, ఈ వీడియోను ఇతర యాత్రికులకు చూపించి వారిని అప్రమత్తం చేశారు. నల్లమల అడవిలో పులుల సంచారం సాధారణమే అయినప్పటికీ, యాత్రికులు గుంపులుగా మాత్రమే ప్రయాణించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. పులి ఎదురుపడిన ఘటనతో ఆందోళన నెలకొన్నప్పటికీ, స్వామి దయతో ప్రమాదం తప్పిందని భక్తులు విశ్వసిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: