గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల మీదుగా నాందేడ్ – తిరుపతి- నాందేడ్ల మధ్య రెండు వేర్వేరు ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను నడుపు తున్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. నాందేడ్ నుంచి తిరుపతి (Nanded to Tirupati) వెళ్లే నెంబర్ 07189 ఎక్స్ ప్రెస్ జూలై 4 నుంచి 25వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు బయలుదేరి శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

తిరుపతి నుంచి నాందేడ్ ప్రత్యేక రైళ్ల సమయం
తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి నాందేడ్ వెళ్లే నెంబర్ 07190ఎక్స్ ప్రెస్ జూలై 5 నుంచి 26వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి 2.20గంటలకు బయలుదేరి ఆదివారం ఉద యం 9.30గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైళ్లు మార్గమద్యలో ముద్దేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మెడ్చల్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, నెమళ్లపూడి, రొంపిచర్ల, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, జమ్ముల మడుగు, ఎర్రగుంట, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో నిలుస్తాయి. అలాగే నాందేడ్ నుంచి తిరుపతి వెళ్లే నెంబర్ 07015 మరో సర్వీసు జూలై 5 నుంచి 26వరకు ప్రతి శనివారం సాయంత్రం 4.50గంటలకు బయలుదేరి తిరుపతికి ఆదివారం ఉదయం 10.10గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి నాందేడ్ వెళ్లే నెంబర్ 07016సర్వీసు జూలై 6నుంచి 27 వరకు తిరుపతి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4.40గంటలకు బయలుదేరి సోమ వారం మధ్యాహ్నం 1.15గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. మార్గమద్యలో ఈ రైళ్లు ముర్ఖడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మెడ్చల్ , మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, కర్నూ లు, డోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజ ౦పేట, రేణిగుంట స్టేషన్లలో నిలుస్తాయి.
Read also: Railway line: జూలై 4 నుంచి న్యూ పిడుగురాళ్ల శావల్యాపురం మధ్య పాసింజర్ రైలు