ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం ఊహించని సానుకూల ఫలితాలను ఇస్తోంది. గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకాన్ని ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 20 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ పథకం కేవలం ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాకుండా, ప్రజా రక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తోందని ప్రకాశం జిల్లా పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది. జిల్లా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ హర్షవర్థన్ రాజు అందించిన నివేదిక ప్రకారం.. ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చిన తర్వాత జిల్లాలో రోడ్డు ప్రమాదాల మరణాలు గణనీయంగా 19 శాతం తగ్గాయి. సొంత వాహనాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు ఇప్పుడు సురక్షితమైన ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపడమే ఈ మార్పుకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.
Read Also : Telangana Collectors Meeting: పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం
ఈ నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం మరియు సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు కేవలం ప్రజల జేబులకు భారం తగ్గించడమే కాకుండా, వారి ప్రాణాలను కాపాడటంలో కూడా దోహదపడటం ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో లభించిన ఈ ఆశాజనకమైన ఫలితాల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో కూడా ఉచిత బస్సు పథకం వల్ల రోడ్డు ప్రమాదాలపై పడిన ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని అదనపు బస్సులను ప్రవేశపెట్టడం మరియు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :