हिन्दी | Epaper

Road Accident: కారును ఢీ కొన్న లారీ ..నలుగురు మృత్యువాత

Sharanya
Road Accident: కారును ఢీ కొన్న లారీ ..నలుగురు మృత్యువాత

తూర్పుగోదావరి జిల్లా ఆటోనగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సెలవులు కావడంతో కాకినాడలో హాస్టల్లో చదువుకుంటున్న మనవరాల్ని చూసేందుకు ఎంతో ఆత్రుతగా వెళుతున్న ఆ కుటుంబాన్ని ప్రమాదం చిదివేసింది. ఒక్క క్షణంలో జరిగిన ఈ సంఘటన, నలుగురు అమూల్యమైన ప్రాణాలను కాజేసింది.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు:

అప్పటిదాకా సంతోషంగా సాగిన కుటుంబ ప్రయాణం రెప్పపాటున కడతేరింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండల ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు మృత్యువాత పడడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు మృతి చెందడంతో కుటుంబంలో కన్నీరు మున్నీరుగా రోధను వినిపిస్తున్నాయి. అల్లుడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదంతా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అతివేగంగా రావడంతో ఎదురుగా ఉన్న లారీని ఢీకొనే క్రమంలో తప్పించిపోయి ఒక్కసారిగా డివైడ్ అవతలికి వెళ్లడంతో అడ్డుగా వెళుతున్న కారు ఢీకొనగా అంతా జరిగిపోయింది. మృతులు రెప్పపాటు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉప్పులూరి ప్రసాద్ (58), ఉప్పులూరి లీలావతి ( 54) ఇమ్మని సత్యవతి (72),లక్కంసాని బిందు ( 33), పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. కుటుంబాన్ని నాశనం చేసిన యూటర్న్

ప్రమాదానికి ప్రధాన కారణంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యతే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన విషయాన్ని లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ వెల్లడించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అకస్మాత్తుగా యూటర్న్ చేసుకునే క్రమంలో కొవ్వూరు నుంచి కాకినాడ వైపు వస్తున్న వీరి వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రమాద సమయంలో జరిగిన ఘటనను ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటనతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్ర విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి, సమాజాన్ని కుదిపేసింది. మనవరాలిని చూసేందుకు ప్రేమతో బయలుదేరిన ప్రయాణం, ఒక్క ప్రమాదంతో శవయాత్రగా మారింది. స్థానికంగా ప్రజలు శోకంలో మునిగిపోయారు.

Read also: Guntur: భార్యను అశ్లీల వీడియోలతో చిత్రహింసలకు గురి చేసిన కానిస్టేబుల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870