ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) నేటి (జూన్ 1) నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొత్తం 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా ఈ సరుకుల పంపిణీ జరుగనుంది. ఈసారి ప్రత్యేకతగా ఆదివారాల్లోనూ సరుకుల పంపిణీ కొనసాగుతుంది. ప్రతి నెల తొలి 15 రోజులు రెండు పూటలా సరుకులు పంపించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇంటి వద్దే పంపిణీ
ఈసారి రేషన్ పంపిణీ(Ration Distribution)లో ప్రభుత్వం మరింత హ్యూమన్ టచ్ చూపిస్తోంది. దివ్యాంగులు మరియు 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చర్య వల్ల వారు క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇది సామాజిక న్యాయానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అధికారికంగా కార్యక్రమ ప్రారంభం
ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, వార్డు నంబర్ 18లోని రేషన్ దుకాణం వద్ద మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని పౌరసౌకర్యాల కల్పనపై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Russia: రష్యా తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ నివేదిక