Bhogapuram Vijayawada Airport: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మరియు విజయవాడ నూతన టెర్మినల్ నిర్మాణ పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏఏఐ (AAI), బీసీఏఎస్ (BCAS), డీజీసీఏ (DGCA) అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: Chandrababu & Pawan Kalyan : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన చర్చ ఇదే
సమీక్షలోని ముఖ్యాంశాలు
- భోగాపురం ఎయిర్పోర్ట్: ఈ విమానాశ్రయం ఇప్పటికే 97 శాతం నిర్మాణ పనులను పూర్తి చేసుకుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం కేవలం రోడ్డు కనెక్టివిటీ, ఇతర మౌలిక వసతుల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.
- విజయవాడ టెర్మినల్: గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ పనులను కొత్త కాంట్రాక్టర్కు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
- కొత్త సర్వీసులు: ఈ రెండు విమానాశ్రయాల నుండి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించడంపై ఎయిర్లైన్ భాగస్వామ్యులతో చర్చించారు. విమానాల సమయాలు, సర్వీసుల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Bhogapuram Vijayawada Airport: అభివృద్ధికి ఊతం
రాష్ట్ర ప్రజల కనెక్టివిటీని పెంచడంతో పాటు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ రెండు విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గతంలో అనేకసార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, ఈసారి పనుల తుది దశపై అధికారులకు స్పష్టమైన గడువులను నిర్దేశించారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :