हिन्दी | Epaper

Rain Alert: ఆంధ్రకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు

Sharanya
Rain Alert: ఆంధ్రకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలపై మళ్ళీ వాతావరణ విపరీత పరిస్థితులు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారింది. దీనివల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు జారీ చేశారు.

వాయుగుండం ప్రభావం

వాయుగుండం ప్రస్తుతం పారాదీప్‌కు తూర్పు ఈశాన్య దిశగా సుమారు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వర్షాల ప్రభావం

రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది. శుక్రవారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నిన్న గురువారం సాయంత్రం 5 గంటల నాటికి పల్నాడు జిల్లా రెంటపాళ్ళలో 47.5మిమీ, గరికపాడులో 41, సత్తెనపల్లిలో 34.5మిమీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో వాతావరణ పరిస్థితి

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో వ్యాపించాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోకి కూడా వీటి ప్రభావం విస్తరించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు నల్లగొండలో గరిష్టంగా 37°C, మహబూబ్ నగర్‌లో కనిష్టంగా 29.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. రాబోయే మూడు రోజులలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి తక్కువగా, సుమారు ఐదు నుండి ఏడు డిగ్రీల తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాయుగుండం ప్రభావంతో వచ్చే వర్షాలు పంటలకు మేలు చేసే అవకాశమున్నా, కొన్ని ప్రాంతాల్లో వరద ముప్పు కూడా ఉండవచ్చు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. ప్రభుత్వం ఇప్పటికే సహాయ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు సమాచారం.

Read also: PSR Anjaneyulu: ఎట్టకేలకు జెత్వానీ కేసులో ఆంజనేయులుకు బెయిల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870