ప్రధాని నరేంద్ర(PM Modi) మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం 9.50 గంటలకు కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్న అనంతరం, హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి(Srisailam) బయలుదేరుతారు. ఉదయం 10.55 గంటలకు శ్రీశైలంలోకి చేరి, 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. శ్రీశైల దేవస్థానం 12 జ్యోతిర్లింగాలు, 52 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం మోదీ శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, భ్రమరాంబ గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటారు.
Read also: Pak-Afghan: పాక్–ఆఫ్ఘాన్ కాల్పుల విరమణ

₹13,430 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. దాదాపు ₹13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులు విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ మరియు పరిశ్రమల రంగాలకు సంబంధించినవని ప్రధాని ఎక్స్ (X) లో తెలిపారు. తదుపరి, డ్రోన్ సిటీ ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు పునాదులు వేస్తారు. కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లతో కలిసి సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొననున్నారు.
భారీ ఏర్పాట్లు – కూటమి ఫోకస్
ప్రధాని(PM Modi) పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 12 మంది మంత్రులు కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు మూడు లక్షల మందికి సీటింగ్ సౌకర్యం కల్పించారు. ప్రజల రాకపోకల కోసం 7 వేల బస్సులు, భద్రత కోసం 7,500 మంది పోలీసులను నియమించారు.డీజీపీ హరీష్కుమార్ గుప్తా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించి, ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సూచించారు. ఆయన ప్రకారం, “మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది.”
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: