हिन्दी | Epaper

Janasena: పార్టీకి రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

Anusha
Janasena: పార్టీకి రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా తొలి సభ్యత్వం తీసుకుని పార్టీకి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారిని “ఉద్యమి”గా గౌరవిస్తామని తెలిపారు.

Read Also: Telangana: పార్టీ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan announces donation of Rs 2 crore to the Janasena party
Pawan Kalyan announces donation of Rs 2 crore to the Janasena party

జనసేన పార్టీ ప్రారంభంలో 150 మందితో మొదలు

పార్టీ పోరాటానికి బలం చేకూర్చి, నవతరంలో ప్రేరణ కలిగించే వారిని “సాధక్”గా, పరోక్షంగా సమయం, ఆర్థికం, సాంకేతికం, సేవా, మేధో సహకారాలు అందించే వారిని “ప్రదాత”గా ఇకపై పిలుస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన (Janasena) పార్టీ ప్రారంభంలో 150 మందితో మొదలైందని, 2021లో మొదటి విడత సభ్యత్వంలో 90 వేలు నమోదు అయ్యాయని పవన్ తెలిపారు. గత ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందని.. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని ఆయన గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870