ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి కృత్రిమ మేధ (AI) విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం ఐటీ శాఖ తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా సహకారంతో ‘ఏఐ లివింగ్ ల్యాబ్స్’ పేరుతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.
AP: పెరుగుతున్న ట్రాఫిక్కు చెక్.. విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

ఈ నెల 19 నుంచి ప్రారంభ దశ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును కంపెనీస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 8 కింద లాభాపేక్ష లేని సంస్థగా(Nvidia) నమోదు చేయనున్నారు. అమరావతిని కేంద్రంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా విద్య, పరిశోధన కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఈ విశ్వవిద్యాలయం విద్యా రంగానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ రంగం, ఫిన్టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వనుంది. ప్రభుత్వ పాలనలో ఏఐ(Nvidia) వినియోగంపై కూడా పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: