ఎన్టీఆర్ జిల్లా (NTR District) గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో, స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే, పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లాడు.
Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశం
అయితే పాఠశాల యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించి వేసింది. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప మాలధారులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. మాల (Ayyappa Mala) ధరించిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు
వివాదం పెద్దదికావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన భవానీపురం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఈ విషయంలో ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో అయ్యప్ప దీక్షదారులంతా కలిసి ఈ విషయాన్ని డీఈవో యు.వి.సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడడంతో సమస్య సద్దుమనిగింది. కాగా జరిగిన సంఘటనపై అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పి విద్యార్థిని అనుమతిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో ఇటీవల విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు ఉన్నత పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో వివాదం చోటు చేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: