हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్ – చంద్రబాబు

Sudheer
ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్ – చంద్రబాబు

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్ గ్లోబల్ మర్చంట్‌గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. “1997 నుంచి దావోస్‌కి హాజరౌతున్నాను. అప్పట్లో భారత్‌కు అంతగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచం భారత్ వైపుగా చూస్తోంది. 2028 నాటికి భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రపంచంలో భారత్ “అన్స్టాపబుల్ ” అని చంద్రబాబు చెప్పారు.

అలాగే ఇక్కడ వేర్వేరు రాజకీయ పార్టీల ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ, దేశం అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కలిసి పనిచేస్తే మాత్రమే వికసిత భారత్ సాధ్యమవుతుంది అని తెలిపారు. వ్యవసాయం, మానవాభివృద్ధి రంగాలలో డీప్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఇండియా బ్రాండ్ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఈ అభివృద్ధి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 165 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధిరేటులో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని, ఆ దిశగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

దావోస్‌లో తొలిసారి భారత్ తరఫున అన్ని రాష్ట్రాల నాయకులు కలిసి ఒకే వేదికపై చర్చలు జరిపారని చంద్రబాబు వివరించారు. “ఇది భారత అభివృద్ధి దిశలో ఒక పెద్ద ముందడుగు. అన్ని పార్టీల నేతలతో కలిసి పనిచేయడం వల్ల దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఈ సదస్సు ద్వారా భారత్‌కి మరింత గౌరవం పెరిగింది” అని అన్నారు.

చంద్రబాబుతో పాటు దావోస్‌ సదస్సులో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భారత్ అభివృద్ధి పట్ల తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి రాష్ట్రం తనవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, దావోస్ వేదిక ద్వారా ఈ సందేశం ప్రపంచానికి వెళ్లిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870