हिन्दी | Epaper

Lokesh: మంత్రి లోకేష్ చొరవతో గ్రీన్‌ ఛాలెల్‌ ద్వారా గుండె తరలింపు

sumalatha chinthakayala
Lokesh: మంత్రి లోకేష్ చొరవతో గ్రీన్‌ ఛాలెల్‌ ద్వారా గుండె తరలింపు

Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రి నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా ఒక మహిళ గుండెను విజయవంతంగా తరలించారు. చెరుకూరి సుష్మ అనే మహిళ గుంటూరు రమేష్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆస్పత్రి వైద్యులు ఆమె కుటుంబసభ్యులకు అవయవదానంపై అవహాన కల్పించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేయడానికి అంగీకరించారు. దీంతో ఆసుపత్రి వైద్యులు మంత్రి నారా లోకేష్‌ను సంప్రదించారు. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆస్పత్రి వైద్యుల అభ్యర్థనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు.

మంత్రి లోకేష్ చొరవతో గ్రీన్‌ ఛాలెల్‌

సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు

బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ గుండెను తరలించేందుకు తన సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేయించారు. గుండెను తరలించేందుకు వీలుగా లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారు. అలాగే బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి చేరే వరకూ గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి.. గుండెను తరలించారు. గుంటూరు నుంచి తొలుత గన్నవరం విమానాశ్రయానికి తరలించిన అధికారులు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోంది

మరోవైపు తన భార్య అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడినట్లు బ్రెయిన్ డెడ్ అయిన మహిళ భర్త శ్రీనివాస్ తెలిపారు. వెంటనే రమేష్ ఆస్పత్రికి తీసుకొచ్చామని వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోమాలోకి వెళ్లారని అన్నారు. ఆ తర్వాత బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు చెప్పారని.. అవయవదానం గురించి వివరించారన్నారు. ఆస్పత్రి యాజమాన్యం, మంత్రి నారా లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోందని అభిప్రాయపడ్డారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870