हिन्दी | Epaper

Nara Lokesh : మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

Sai Kiran
Nara Lokesh : మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

Nara Lokesh : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన మద్య నిషేధం హామీ వెనుక అసలు కథ వేరే ఉందని ఆయన అన్నారు. ప్రజలను వంచించడానికే ఆ హామీ ఇచ్చారని లోకేశ్ ట్విట్టర్ (X) వేదికగా విమర్శించారు.

మద్యం వ్యాపారం, ప్రతి నెలా భారీ ముడుపులా?

మద్యం వ్యాపారం ద్వారా ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల వరకు ముడుపులు అందాయని లోకేశ్ ఆరోపించారు. గత ఐదేళ్లలో ఈ వ్యవహారంలో రూ.3,500 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Also: Washing machine offers : రూ.19 వేలు వాషింగ్ మెషీన్ ఇప్పుడు ఏడు వేలకే భారీ ఆఫర్

ఈడీ దర్యాప్తులో బయటపడిన లావాదేవీలు?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Nara Lokesh) ఇప్పటికే రూ.1,048 కోట్ల నగదు లావాదేవీల జాడను గుర్తించిందని లోకేశ్ గుర్తుచేశారు. ఒకవైపు మద్య నిషేధం గురించి ప్రజల ముందు ప్రసంగాలు చేస్తూనే, మరోవైపు అక్రమ మద్యం ద్వారా వేల కోట్లు సంపాదించారని ఆయన విమర్శించారు.

జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న

ఈ వ్యవహారం వల్ల వేలాది పేద కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయాయని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీపై ఏపీ ప్రజలకు సమాధానం చెబుతారా? లేక మౌనంగా ఉంటారా? అంటూ జగన్‌కు సూటి ప్రశ్న సంధించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870