हिन्दी | Epaper

Nandyal bus accident: హఠాత్తుగా బస్సులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

Saritha
Nandyal bus accident: హఠాత్తుగా బస్సులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు భయానికి ప్రయాణికులను గురిచేస్తున్నాయి. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది. ఇప్పుడు (Nandyal bus accident) తాజాగా నంద్యాల జిల్లాలో మరో ప్రైవేట్ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని శిరివెళ్లమిట్ట సమీపంలో కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ కు బస్సు ప్రమాదానికి గురైంది. శిరివెళ్లమిట్ట మీదుగా వెళ్తోన్నప్పుడు బస్సు టైర్ పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పింది. కుడివైపు డివైడర్ దాటుకుని దూసుకెళ్లింది. ఎదురుగా వస్తోన్న ఓ కంటైనర్ ట్రక్ ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి.

Read Also: Anantapur Crime: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Nandyal bus accident

పూర్తిగా కాలిపోయిన ప్రైవేటు బస్సు..

(Nandyal bus accident) ఘటనలో బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆయనను కడప జిల్లాకు(Kadapa District) చెందిన భాస్కర్ గా గుర్తించారు. బస్సు ఢీ కొట్టిన వేగానికి కంటైనర్ ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ట్రక్ డ్రైవర్, క్లీనర్‌ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయారు. బయటకు రాలేక మంటల బారిన పడి, సజీవదహనం అయ్యారు. కంటైనర్ లో ఉన్న కొత్త బైక్స్ మంటల్లో కాలి బూడిద అయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరూ కూడా ప్రాణాలతో బయటపడగలిగారు. 14 మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టుకుని ప్రయాణికులు బయటికి రాగలిగారు. క్లీనర్, ఈ మార్గంలో వెళ్తోన్న ఇతర వాహనదారులు వారికి సహాయం చేశారు. సమాచారం అందిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్, ఆళ్లగడ్డ డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870