हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

చంద్ర‌బాబును క‌లిసిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి

Divya Vani M
చంద్ర‌బాబును క‌లిసిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి

చంద్ర‌బాబును క‌లిసిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా మాజీ మంత్రిగా పనిచేసిన నాగం జనార్థన్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.అనేక సంవత్సరాల తర్వాత కలిసిన నాగంను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.”ఎలా ఉన్నారు నాగం గారూ? ఆరోగ్యం బాగుందా చాలా కాలమైంది కలిసింది” అంటూ ఆప్యాయంగా పలకరించారు.నాగం కుటుంబం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.అలాగే పిల్లలు ఏం చేస్తున్నారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని సూచించారు.ఓబులాపురం మైనింగ్ వివాదంపై ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు తీవ్ర ఉద్యమం చేశారు.అప్పట్లో తెలుగుదేశం నేతలపై కేసులు నమోదయ్యాయి. వాటిలో నాగం జనార్థన్ రెడ్డి పేరు కూడా ఉంది. ఈ కేసుల విచారణలో భాగంగా గత గురువారం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.

చంద్ర‌బాబును క‌లిసిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి
చంద్ర‌బాబును క‌లిసిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి

అయితే ఈ కేసులను ఎట్టకేలకు కోర్టు కొట్టివేయడం చంద్రబాబు హర్షించారన్నారు.ఈ సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును కలిశారు. ఇద్దరూ పాత రాజకీయ జ్ఞాపకాలను తలచుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాటి ప్రజా ఉద్యమాలు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కీలక సంఘటనలు గురించి చర్చించారు.”నాగం గారు ఫైర్ బ్రాండ్ లీడర్. పార్టీ ఆదేశిస్తే వెనుకంజ వేయకుండా ముందుండే వారు” అని చంద్రబాబు గుర్తుచేశారు.నాగం ఎమోషనల్‌గా వ్యవహరించే వారు, ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేసే వ్యక్తి అని అన్నారు.

ఈ సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డి స్పందిస్తూ, “నాలుగవసారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు సమగ్ర అభివృద్ధి సాధించాలని, ప్రజలు అన్ని రంగాల్లో విజయాలను అందుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.”తెలుగు ప్రజల భవిష్యత్తు బంగారు రోజులు రావాలన్నదే నా ఆకాంక్ష” అని అన్నారు.నాగం జనార్థన్ రెడ్డి చంద్రబాబు భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా కొత్త అనుబంధాలు ఏర్పడతాయా తెలుగుదేశం పార్టీలో ఆయన మళ్లీ కీలకంగా మారతారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో చంద్రబాబు, నాగం మధ్య రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, పార్టీ వ్యూహాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.పాత మిత్రులు చంద్రబాబు – నాగం జనార్థన్ రెడ్డి మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక భేటీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నాగం తిరిగి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా అనే చర్చలు కూడా ఊపందుకున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చంద్రబాబు పై వైసీపీ ఆగ్రహం

చంద్రబాబు పై వైసీపీ ఆగ్రహం

రెడ్ క్రాస్ లో ఘనంగా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

రెడ్ క్రాస్ లో ఘనంగా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..

ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..

పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ

పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ

‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు

‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు

పెంపుడు కుక్క ను కొట్టి చంపిన గ్రామ‌స్తులు
1:05

పెంపుడు కుక్క ను కొట్టి చంపిన గ్రామ‌స్తులు

రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

📢 For Advertisement Booking: 98481 12870