కర్నూలుకు చెందిన కోవాబన్ వ్యాపారి వలీకి జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు అండగా నిలిచారు. కర్నూలు నగరంలో కోవాబన్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వలీ అనే సామాన్య వ్యాపారికి జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తన వంతు సాయం అందించారు. మంగళవారం వలీని స్వయంగా కలిసిన నాగబాబు, ఆయన విక్రయించే కోవాబన్ను రుచి చూశారు. అనంతరం వలీ కుటుంబ పరిస్థితులు, వ్యాపార స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఆయన, తక్షణ సాయం కింద రూ. 25,000 నగదును అందజేశారు. కష్టపడి పని చేస్తూ, తనకున్న పరిమిత వనరులతో గౌరవంగా బతుకుతున్న ఒక సామాన్యుడికి అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్
ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియాలో వలీపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కేవలం ఒక వ్యక్తి చేస్తున్న వ్యాపారాన్ని మతపరమైన కోణంలో చూడటం ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. కులమతాలకు అతీతంగా కష్టపడే ప్రతి శ్రామికుడికి సమాజంలో గౌరవం దక్కాలని, అనవసరంగా మత రంగు పులిమి ఒకరి జీవనోపాధిని దెబ్బతీయడం అన్యాయమని ఆయన స్పష్టం చేశారు. వలీ వంటి చిన్న తరహా వ్యాపారులను ప్రోత్సహించాలే తప్ప, ఇటువంటి వివాదాల్లోకి లాగకూడదని ఆయన కోరారు. నాగబాబు చేసిన ఈ పనిని చూసి స్థానికులు మరియు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com