1996లో దళ సభ్యుడిగా మావోయిస్టుల్లో(Moaist Encounter) చేరిన హిడ్మా, తుపాకీతో ముందుకు దూసుకెళ్లే యోధుడిగా కాకుండా, పూర్తిగా వ్యూహాలు రచించే కీలక నాయకుడిగా ఎదిగాడు. క్యాడర్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలనే విషయాల్లో మావోయిస్టులకు నిరంతరం సూచనలు ఇస్తూ, మొత్తం దళానికి ఆలోచనాత్మక మార్గదర్శకత్వం వహించేవాడు.
Read Also: Bangladesh: పాక్, బంగ్లాదేశ్ కుట్రలో భాగమే హసీనాకు ఉరిశిక్ష?
దేశవ్యాప్తంగా పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 ప్రధాన దాడులకు హిడ్మానే(Moaist Encounter) నేతృత్వం వహించినట్లు భద్రతా విభాగాలు గుర్తించాయి. అతడి వ్యూహాలు మావోయిస్టుల కార్యకలాపాలను సంవత్సరాల తరబడి బలోపేతం చేశాయి. హిడ్మాపై కేంద్ర ప్రభుత్వం రూ. 45 లక్షల రివార్డు ప్రకటించగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల రివార్డులు కలిపి మొత్తం బహుమతి రూ. 6 కోట్లకు చేరుకుంది. అతడిని పట్టుకోవడానికి అనేక ఏజెన్సీలు సంవత్సరాలపాటు ఆపరేషన్లు నిర్వహించాయి.
తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతిచెందడం, మావోయిస్టులకు భారీ దెబ్బగా పరిగణిస్తున్నారు. ఆయన వ్యూహాత్మక నాయకత్వం ముగియడంతో దళం కార్యకలాపాలపై ఇది గణనీయ ప్రభావం చూపనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: