हिन्दी | Epaper

Kavitha Letter : ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

Sudheer
Kavitha Letter : ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓ కీలక లేఖ రాసారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలు చట్ట విరుద్ధంగా చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయబడ్డాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. భద్రాచలం రామాలయ ప్రాంతంలోని యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

రామాలయ భూములపై ఆక్రమణల ఆందోళన

కవిత లేఖలో మరో ముఖ్య అంశంగా భద్రాచలం శ్రీరాముల వారి భూముల పరిరక్షణను ప్రస్తావించారు. పురుషోత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటంతో, రామాలయానికి చెందిన భూములపై అక్రమ కబ్జాలు కొనసాగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు భౌతిక దాడులకు గురవుతున్నారని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని మసకబార్చేలా ఉన్నాయని ఆమె హెచ్చరించారు.

ప్రజల ఆవేదన, మానవతా దృష్టితో నిర్ణయం తీసుకోండి

విలీనమైన ఐదు గ్రామాల్లో ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక సేవలకు నానా ఇబ్బందులు పడుతున్నారని కవిత లేఖలో తెలిపారు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సేవలు పొందాల్సిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆమె వాపోయారు. భద్రాచలంలోని రాముల వారి ఆలయ పునాదులు మరియు అక్కడి ప్రజల ఆవేదనను గౌరవించి, మానవతా దృష్టితో తెలంగాణలో ఐదు గ్రామాల విలీనానికి చంద్రబాబు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజకీయ లబ్దిని కాదని, రాముని భక్తులను కాపాడాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Read Also : Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870