అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా (Jai Shah) ఈరోజు (సెప్టెంబర్ 22) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన క్రికెట్ పరిపాలనలో చూపిస్తున్న దూరదృష్టి, సమర్థత, కొత్త ఆవిష్కరణలకు కట్టుబాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల అభిమానం పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జై షాను ‘నా సోదరుడు’ అని సంబోధిస్తూ ఆయన నాయకత్వ పటిమను, క్రికెట్లో చేపట్టిన సంస్కరణలను లోకేశ్ ప్రత్యేకంగా కొనియాడారు. జై షా ఆధ్వర్యంలో క్రికెట్ (Cricket) ఆట సరికొత్త శిఖరాలకు చేరిందని ప్రశంసించారు.జై షా నాయకత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలను లోకేశ్ తన సందేశంలో గుర్తుచేశారు.
విజయవంతంగా ప్రారంభించడం
ముఖ్యంగా మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా వేతనాలు అమలు చేయడం, మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) (డబ్ల్యూపీఎల్)ను విజయవంతంగా ప్రారంభించడం వంటివి చరిత్రాత్మకమని పేర్కొన్నారు. వీటితో పాటు క్రీడాకారుల వేతనాలు, పెన్షన్లను బలోపేతం చేయడం, రికార్డు స్థాయిలో మీడియా హక్కులను సాధించడం ద్వారా ఆట అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని అన్నారు.
“మీరు క్రికెట్కు, భారతదేశానికి మరెన్నో సంవత్సరాలు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని నారా లోకేశ్ తెలిపారు. జై షా దార్శనికతతో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లు, ప్రతి క్రీడాకారుడు, ప్రతీ అభిమాని ఉన్నత స్థాయికి చేరాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఆయన దృఢమైన నాయకత్వాన్ని తాను ఎంతగానో ఆరాధిస్తానని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: