हिन्दी | Epaper

Minister Farooq: మైనారిటీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి – మంత్రి ఫరూక్

Sharanya
Minister Farooq: మైనారిటీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి – మంత్రి ఫరూక్

విజయవాడ: రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల పురోభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కూటమి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టి ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ (Minister NMd Farooq) పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీ కార్యాలయంలో మైనారిటీ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష చేశారు.

మైనారిటీ సంక్షేమ శాఖ (Minority Welfare Department) ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, వివిధ భవనాల నిర్మాణ పనులు పూర్తికి నిధుల వినియోగం, ప్రధాన మంత్రి విరాసత్ క సంవర్ధన్, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, జాతీయ మైనారిటీల అభివృద్ధి ఆర్థిక సంస్థ పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధుల వినియోగం, హజ్ 2026 యాత్రకు తీసుకొనే ముందస్తు చర్యల ప్రణాళిక, వక్స్ ఆస్తుల పరిరక్షణ, పురోభివృద్ధికి చర్యలు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల పంపిణీ, తదితర అంశాలపై మైనారిటీ సంక్షేమ శాఖ విభాగాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయన్న విషయాలపై మంత్రి ఫరూక్ (Minister Farooq) సుదీర్ఘంగా సమీక్ష చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి యాకుబ్ భాష, వక్స్ బోర్డు సీఈవో మహమ్మద్ అలీ, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ లు తదితరులు తమ విభాగాల పరిధిలో అమలవుతున్న, తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ హజ్ యాత్రకు రాష్ట్రం నుండి వెళ్లిన 1618 మంది యాత్రికులకు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Chandrababu: అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రానికి సాయం చేయండి: చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870