Mangalagiri AIIMS: మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో సౌకర్యాల అభివృద్ధి అంశాలపై అధికారులతో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Dr. Pemmasani) ఈ గురువారం సమీక్షించారు. సందర్భంగా డా. పెమ్మసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిమ్స్ లో ఉన్నటువంటి సమస్యలను ఎలా అధిగమించాలని అంశంపై గతంలో రివ్యూలో సమీక్షించి ఎయిమ్స్ ను ఆంధ్రప్రదేశ్ కు గొప్ప రీసెర్చ్, అకడమిక్ ఇన్స్టిట్యూట్ గా చేయాలనే ఉద్దేశంతో ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర విషయాన్ని తీసుకెళ్లి దాదాపుగా 500 లకు పైగా పోస్టులను తీసుకురాగలిగామని అన్నారు.
Read Also: Kinjarapu Atchannaidu: ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

వైద్య సౌకర్యాల పెంపు
గతంలో 12 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ప్రస్తుతం 87 థియేటర్స్ వున్నాయని తెలిపారు. గతంలో మూడు ఫార్మసీ కౌంటర్లు ఉంటే ఇప్పుడు మూడు నుంచి ఏడు ఫార్మసీ కౌంటర్లు పేషంట్లకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. బస్సు షెల్టర్ కావాలంటే అందుబాటులోకి తీసుకువచ్చామని హైవే నుంచి వచ్చేవాళ్ళకు అనుకూలంగా ఉండేలా ర్యాంప్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: