ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్ (Minister Lokesh), వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ‘మొంథా’ తుపాను సృష్టించిన నష్టంపై కేంద్ర మంత్రులతో వారు కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను కలవనున్నారు. తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను వారు కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు.
Read Also: Kashi Tamil Sangamam : కాశీ–తమిళ సంగమం నాలుగో ఎడిషన్కు వారణాసిలో శ్రీకారం…

టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు
రాష్ట్రానికి అవసరమైన సహాయంపై చర్చించనున్నారు. ఈ సమావేశం కోసమే మంత్రులు లోకేశ్, (Minister Lokesh) అనిత నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. తుపాను నష్టం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు కోరడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: