విజయవాడ : కల్తీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతున్న
సమయంలో మరో అరెస్టు చోటుచేసుకుంది. పోలీసులు చైతన్యబాబు (ఎ22) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చైతన్యబాబు పెద్దతిప్ప సముద్రం మండలంలోని ఆంధ్రా (Andhra)వైన్స్లోలో పని చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. తంబళ్లపల్లె కోర్టులో చైతన్యను ఎక్సైజ్ పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసులో (Liquor case)ఈ తాజా అరెస్టుతో కేసులో మొత్తం 14 మంది నిందితులు అయ్యారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావు సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ తాజా అరెస్టుతో కేసులో మొత్తం 14 మంది నిందితులు అయ్యారు.
Read also: సూపర్ సక్సెస్ దిశగా దూసుకెళ్లిన మస్క్ స్పెస్ ఎక్స్ రాకెట్

అద్దేపల్లి జనార్దన్రావు సహా మొత్తం 14 మంది నిందితులు
నకిలీ మద్యం కేసు (Liquor case) రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేలా అక్రమంగా మద్యం తయారీ, సరఫరా జరిగిందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎవరినీ వదలకుండా, వాస్తవాలు వెలికి తీయాలని స్పష్టం చేసింది. మద్యం తయారీలో పాల్గొన్న సరఫరాదారులు, ఆర్థిక మద్దతుదారులు వంటి వారందరినీ గుర్తించాలన్నది సిట్ ప్రధాన లక్ష ్యంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: