हिन्दी | Epaper

Latest News: ST Reservation – వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణకు పోరాటం

Anusha
Latest News: ST Reservation – వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణకు పోరాటం

ఉమ్మడి చిత్తూరు జిల్లాప్రతినిధుల సమావేశం

పుంగనూరు (చిత్తూరు) :ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకి, బోయ కులస్తులకు ఎస్టీ రిజర్వేషన్, పునరుద్ధరించేంత వరకు పోరాటాలు కొనసాగించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షుడు (President of the State Valmiki Society) కనుమ కుంట సుకుమార్ బాబు స్పష్టం చేశారు. కమ ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన బోయ వాల్మీకి సంఘం కృతజ్ఞతలు సమావేశం ఆదివారం పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుకుమార్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీలుగా పరిగణిస్తామని మాట చెప్పి తప్పినందువల్ల ఆ పార్టీకి బుద్ధి చెప్పామన్నారు.

తమ ప్రభుత్వం కృషి చేస్తుందని

ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మాట ఇచ్చిందన్నారు. అయితే, రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యల వల్ల కూటమి ప్రభుత్వానికి గడువు కేటాయించామన్నారు. దేశంలో వాల్మీకులను గిరిజనులుగా పరిగణించిన తొలి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ప్రముఖ స్థానం ఉందన్నారు. గతంలో రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించారని, ఆ తరువాత రిజర్వే షన్ తొలగించారన్నారు. రెండు దశాబ్దాలు గా వాల్మీకుల రిజర్వేషన్లపై పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదన్నారు.

Latest News
Latest News

దయనీయ పరిస్థితిపై

ఈ సమావేశంలో సీనియర్ వాల్మీకి సంఘ నాయకులు కుప్పం సురేష్, అద్దాల నాగరాజు, న్యాయవాది ఎల్. భాస్కర్లు మాట్లాడుతూ సమాజంలో అణగారిపోయిన వృత్తుల కుటుం బాలలో వాల్మీకుల దయనీయ పరిస్థితిపై భారత మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసిందని వివరించారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం, మాడి శంకరప్ప, వి కోట జయ చంద్ర, రెంటకుంట్ల నరసింహులు, బొమ్మనపల్లి ముని స్వామి, కొలిమి శ్రీనివాసులు, టైలర్ శ్రీనివా సులు, పెద్ద పంజాని గంగప్ప, ఏ. కొత్తకోట చిన్న, కే. రెడ్డప్ప, సోమల శంకరప్ప, శ్రీనివా సులు, వెంకటస్వామి, వెంకటేష్ నేటిగుట్లపల్లి శ్రీనివాసులు, ఈడిగపల్లి నరేష్, బ్యాంకు రాజ శేఖర్, రిటైర్డ్ టీచర్ రెడ్డప్పలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read hindi news:

Read Also:

https://vaartha.com/latest-news-congress-chief-sharmila-support-onion-farmers/andhra-pradesh/543657/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870