Kurnool fire accident: కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో మంటలు చెలరేగి, భారీగా పొగలు అలముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.వేసవి కాలం సమీపిస్తుండటంతో గోదాంలో పెద్ద ఎత్తున కూలర్లు, వాటికి సంబంధించిన ప్లాస్టిక్ బాడీలు నిల్వ ఉంచడంతో మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
Read Also: Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

భారీగా ఆస్తి నష్టం
పని చేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సిలిండర్లు పేలిన సమయంలో వచ్చిన భారీ శబ్దానికి చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పని చేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న లక్షలాది రూపాయల విలువైన ప్లాస్టిక్ కూలర్లు, యంత్రాలు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ సిలిండర్లు పేలిన సమయంలో సిబ్బంది బయట ఉండటంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: