हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Kurnool Tragedy: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి

Aanusha
Latest News: Kurnool Tragedy: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి

కర్నూలు (Kurnool) జిల్లా లో కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.. మరికొందరు తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kurnool Crime: ట్రావెల్స్ బస్సులో మంటలు.. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి?

ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంల వరకు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (Vice President C.P. Radhakrishnan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “కర్నూలులో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా దురదృష్టకరం.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kurnool Crime
Kurnool Crime

మెరుగైన వైద్య సహాయం అందించాలి

ఏపీ అధికారుల‌తో మాట్లాడి అవ‌స‌‌ర‌మైన స‌హాయ‌క‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర అధికారుల‌ను ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గ‌ద్వాల కలెక్ట‌ర్‌, ఎస్పీ ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లాల‌ని సీఎం ఆదేశించారు.మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఈ దుర్ఘటనపై స్పందిస్తూ,

“ఈ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలి” అని కోరారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు ఎమర్జెన్సీ డోర్ అద్దాలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది

చూస్తుండగానే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడంతో మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు.

ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించి, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని రవాణా, సహాయక బృందాలకు మంత్రి సూచనలు జారీ చేశారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

📢 For Advertisement Booking: 98481 12870