हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Kishan Reddy: సామాజిక బాధ్యత, ఆర్థిక రాజకీయ, కమ్యూనిజంలో లేదు

Tejaswini Y
Kishan Reddy: సామాజిక బాధ్యత, ఆర్థిక రాజకీయ, కమ్యూనిజంలో లేదు

విజయవాడ : ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతాలను ఆనాటి పాలకులు భారత్ పై రుద్దారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.. గత 12 సంవత్సరాలుగా భారత్ ఏకాత్మ మానవ వాదంలో, నరేంద్ర మోదీ పాలనలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ అనేక సంక్షోభాలతో ఉంటే, మన దేశంలో ఏ రకంగా పరిపాలన జరుగుతోందో దేశ ప్రజలందరూ చూడాలి. అంత్యోదయ కార్యక్రమంలో 12 కోట్ల ఇళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. 1965వ సంవత్సరంలో జరిగిన జనసంఘ్ విధంగానే ఈ కార్యక్రమం కూడా అందరిని తీసుకెళ్తుందన్నారు. విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఏకాత్మ మానవ దర్శన్ జాతీయ మహాసభపునఃస్మరణ సదస్సు జరుగుతోంది.

Read Also: AP: ఇన్‌స్టాలో బాలుడి పరిచయం..ఇల్లు విడిచి వెళ్లిన బాలిక.. తర్వాత ఏమైందంటే?

Kishan Reddy: Social responsibility, economic politics, does not exist in communism
Kishan Reddy: Social responsibility, economic politics, does not exist in communism

12 సంవత్సరాలుగా భారత్ ఏకాత్మ మానవ వాదంలో

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు అని బీజేపీ ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణ సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతాలను ఆ నాటి పాలకులు భారత్ పై రుద్దారని ఎద్దేవా చేశారు. కేపిటలిజం, కమ్యూనిజం ప్రపంచానికి ముఖ్యం అని మాట్లాడుకునే సమయంలో దీనదయాళ్ ఏకాత్మ మానవ వాదాన్ని తీసుకొచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేసారు. గత 12 సంవత్సరాలుగా భారత్ ఏకాత్మ మానవ వాదంలో, నరేంద్ర మోదీ పాలనలో ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ప్రపంచ దేశాలన్నీ అనేక సంక్షోభాలతో ఉంటే, మన దేశంలో ఏ రకంగా పరిపాలన జరుగుతోందో దేశ ప్రజలందరూ నేరుగా చూడాలన్నారు. కమ్యూనిజం అంటున్న చైనాలో కూడా వ్యక్తికి స్వేచ్ఛ లేదని ఆయన తెలిపారు. సామాజిక బాధ్యత, ఆర్ధిక రాజకీయ వికేంద్రీకరణ కేపిటలిజం, కమ్యూనిజంలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

12 కోట్ల ఇళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం, సామాజిక అభివృద్ధి

పాశ్చాత్య ఆలోచనా విధానాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కకు పెట్టి ఏకాత్మ మానవ సిద్ధాంతం వచ్చిందని అన్నారు. 19862 సంవత్సరంలో విజయవాడలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందని, ఆ సన్నివేశాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అంత్యోదయ కార్యక్రమంలో 12 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల(SC ST OBC Development)కు అవకాశం ఇచ్చారని వెల్లడించారు. రోడ్ల పక్కన వ్యాపారాలు చేసే వారికి ప్రధానమంత్రి స్వానిధి కింద చేయూతనిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. దాదాపు 56 కోట్ల మంది పేదలకు జనధన్ అకౌంట్ ఇచ్చారని తెలిపారు. పేద ప్రజలకు అందరికి ఆకాంక్షి ఉపాధ్యాయ న్యాయ జరగాలని ఆయన oచారు. పండిట్ దీన్ దయాళ్ ప్రతిపాదించిన ఇంటిగ్రల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షి ంచడం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం ఈ రెండు రోజుల సదస్సు ప్రధాన లక్ష్యాలుగా బీజేపీ నిర్ణయించింది.

రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సదస్సులో చర్చలు జరగనున్నాయి. సదస్సు ప్రాంగణంలో కేంద్రంలో బీజేపీ పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ లావాదేవీలు పై మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం విమర్శించారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు కూడా ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకుంటు న్నాడని వెల్లడించారు. గిరిజన తండాలు వివక్షకు గురయ్యాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆదివాసీ పల్లెల కోసం సమగ్రమైన మోళిక వసతులు కేంద్రం కల్పిస్తోందని తెలిపారు. రైతులకు సమ్మాన్ నిధి. ఫసల్ భీమా యోజన ద్వారా సహకారం అందిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంచార తెగల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమీషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870