हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

కిరణ్ రాయల్ కి క్లీన్ చిట్

Sharanya
కిరణ్ రాయల్ కి క్లీన్ చిట్

తిరుపతి జనసేన ఇన్చార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్ తాను ఎదుర్కొన్న ఆరోపణల నుంచి పూర్తిగా బయటపడ్డారు. జనసేన పార్టీ తాత్కాలికంగా అతన్ని పక్కన పెట్టినప్పటికీ, తాజా పరిణామాలు ఆయనకు ఊరట కలిగించాయి. ఈ వివాదానికి కేంద్ర బిందువైన లక్ష్మీ రెడ్డి ఇటీవల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో, కిరణ్ రాయల్ మరోసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.

T3kSy6Fm 400x400

కిరణ్ రాయల్‌పై ఆరోపణలు

ఒక మహిళ అయిన లక్ష్మీ రెడ్డి, కిరణ్ రాయల్ తనను రూ.1.20 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు రాజకీయంగా సంచలనం రేపాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ హైకమాండ్ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కిరణ్ రాయల్ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు. అయితే, ఈ కేసులో ఊహించని మలుపు జరిగింది. లక్ష్మీ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి తనకు కిరణ్ రాయల్‌తో ఎలాంటి విభేదాలు లేవని, ఆ విషయంలో అన్ని పరిష్కారమయ్యాయని చెప్పి యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఈ వివాదం కిరణ్ రాయల్‌కు మేలు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలు తుడిచిపెట్టుకుపోవడంతో, కిరణ్ రాయల్ తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు. ఇకపై నేషనల్ హైవేపై దూసుకెళ్లినట్టే, అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాదం తనకు మంచి మేలే చేసిందని, ఎవరు నిజమైనవారో – ఎవరెవరిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారో తెలుసుకున్నానని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తనపై కుట్ర జరిగిందని, లక్ష్మీ రెడ్డిని అడ్డుపెట్టుకుని కొందరు తనను తొక్కేయాలని చూశారని తెలిపారు.లక్ష్మీ రెడ్డికి ఆర్థికంగా ఆశ చూపించారని, ఆమె కొడుకులను బెదిరించారని ఆరోపించారు.ఈ వ్యవహారంలో కొంతమంది రాజకీయ లబ్ది కోసం తన పేరును ఉపయోగించారని వెల్లడించారు. కిరణ్ రాయల్ తన జీవితంలో ఇద్దరికి రుణపడి ఉంటానని, ఒకరు పవన్ కల్యాణ్, రెండు మీడియా అని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలని పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారని కిరణ్ రాయల్ వెల్లడించారు. తనపై కుట్ర చేసిన వారెవరో పవన్ కల్యాణ్‌ ముందుంచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

    పవన్‌కు ఆధారాలతో సమాచారం ఇవ్వనున్న కిరణ్

    తనపై కుట్ర చేసిన వాళ్లంతా ఎవరో తేల్చి చెప్పేందుకు తాను సిద్ధమని కిరణ్ రాయల్ ప్రకటించారు. తాను అన్ని ఆధారాలను పవన్ కల్యాణ్ ముందు ఉంచుతానని తెలిపారు. నేను ఎవరైనా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే, నేను క్షమించను. నా రాజకీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్న వాళ్లందరికీ తగిన బుద్ధి చెబుతాను. నా వద్ద ఉన్న ఆధారాలతో పవన్ గారి ముందు హాజరై నిజాలు బయట పెడతాను, అని అన్నారు. ఈ వివాదం జనసేన పార్టీపై మరొక విధంగా ప్రభావం చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. అయితే, నేతలపై వ్యక్తిగత ఆరోపణలు వస్తే ఎలా స్పందించాలి అనే విషయంలో జనసేన ఒక స్పష్టమైన విధానం అవలంభించడం అవసరమని భావిస్తున్నారు. ఇక, కిరణ్ రాయల్ తిరిగి తన పదవి లోకి రానున్నారా? లేదా పార్టీ ఇప్పటికీ ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తుందా? అన్నది వేచి చూడాలి. అయితే, కిరణ్ రాయల్ మాత్రం ఈ సంఘటన తన రాజకీయ జీవితానికి మరింత బలాన్ని ఇచ్చిందని, ఇకపై మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతానని చెప్పారు.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

    బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

    వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

    వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

    విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

    విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

    వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

    వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

    ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

    ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

    తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

    తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

    ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
    0:26

    ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

    హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

    హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

    జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

    జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

    మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

    మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

    ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

    ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

    దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

    దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

    📢 For Advertisement Booking: 98481 12870