हिन्दी | Epaper

Kanna Lakshminarayana: పల్నాడులో జగన్ పర్యటనపై ఎమ్మెల్యే కన్నా తీవ్ర విమర్శలు

Sharanya
Kanna Lakshminarayana: పల్నాడులో జగన్ పర్యటనపై ఎమ్మెల్యే కన్నా తీవ్ర విమర్శలు

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) ఇటీవల పల్నాడు జిల్లాలో చేపట్టిన పర్యటన తీవ్ర రాజకీయ ఉధృతికి కారణమైంది. ఈ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, గుంటూరు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తీవ్రస్థాయిలో స్పందించారు.

Kanna Lakshminarayana: పల్నాడులో జగన్ పర్యటనపై ఎమ్మెల్యే కన్నా తీవ్ర విమర్శలు
Kanna Lakshminarayana: పల్నాడులో జగన్ పర్యటనపై ఎమ్మెల్యే కన్నా తీవ్ర విమర్శలు

మీడియాతో మాట్లాడిన ఆయన, “జగన్ పర్యటన ఓదార్పు పర్యటనలా కాదు, అది పాలిటికల్ యుద్ధం ప్రకటించినట్లుంది” అంటూ విమర్శల దాడి ప్రారంభించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో సాక్షాత్తూ జగన్ పరిపాలన విధానంపై వేటు వేసినట్లుగా ఉన్నాయి.

నాగమల్లేశ్వరరావు మృతికి నేరుగా జగన్ బాధ్యత

పల్నాడు ఘటనల నేపథ్యంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విషయాన్ని ప్రస్తావిస్తూ కన్నా, నాగమల్లేశ్వరరావు మృతికి నూటికి నూరు శాతం జగనే కారణమని కన్నా ఆరోపించారు. పోలీస్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడం అవాస్తవమన్నారు.

“అరాచక ర్యాలీ.. పైశాచిక ప్రవర్తన”

నిన్న పల్నాడులో అరాచక ర్యాలీ నిర్వహించారు. ఈ పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారు” అని కన్నా మండిపడ్డారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.

“జగన్ పాలన రాక్షస పాలన” – ప్రజాస్వామ్యంపై పాఠాలు చెబుతారా?”

జగన్ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. జగన్ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లాంటి విపక్ష నాయకులను బయటకు రావద్దని బెదిరింపులు పెట్టడం, రాజకీయ దురుద్దేశంతో నియంత్రించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

కమ్మవారి మీద ద్వేష రాజకీయాలన్నా

కన్నా చేసిన మరో కీలక ఆరోపణ ఏమిటంటే, జగన్ పరిపాలనలో కమ్మవారిపై ద్వేషంతోనే అమరరాజా పరిశ్రమను తరిమేశారని, అమరావతిని సర్వనాశనం చేశారని కన్నా ఆరోపించారు. నిన్నటి ఘటనల్లో ఇద్దరి మృతికి జగనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Ambati Rambabu: జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం..అంబటి రాంబాబుపై కేసు నమోదు

Chevireddy Bhaskar Reddy: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870