हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

BREAKING -Jogi Ramesh : జోగి రమేష్ అరెస్ట్

Sudheer
BREAKING -Jogi Ramesh : జోగి రమేష్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయన విజయవాడలోని నివాసానికి సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు చేరుకుని నోటీసులు అందజేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. మొన్నటివరకు ఈ కేసులో ముఖ్య నిందితుడైన ఏ1 జనార్దన్‌ను విచారించిన సిట్ అధికారులు, ఆయన వాంగ్మూలంలో కొన్ని కీలక పేర్లు బయటపడ్డాయని తెలుస్తోంది. వాటిలో జోగి రమేష్ పేరు కూడా ఉండటంతో అధికారులు ఈ అరెస్ట్‌కు దారితీసినట్లు సమాచారం.

Latest News: Cyber fraud: సైబర్ నేరగాళ్ల కొత్త పద్ధతులు – నిర్లక్ష్యం ప్రమాదం

తెలుసుకున్న వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కల్తీ మద్యం కేసులో అనేకమంది వ్యాపారులు, స్థానిక నేతలు, అధికారులు ప్రమేయం ఉన్నట్లు సిట్ అనుమానాలు వ్యక్తం చేసింది. దర్యాప్తు సమయంలో మద్యం ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలో జోగి రమేష్ సన్నిహితుల పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ముఖ్యంగా నాణ్యతలేని మద్యం కారణంగా మరణాలు సంభవించిన ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. సిట్ ఇప్పటికే పదికి పైగా నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరిపింది. ఈ క్రమంలో ఏ1 జనార్దన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రిపై కూడా అనుమానాలు బలపడ్డాయి.

అయితే జోగి రమేష్ మాత్రం తనపై జరుగుతున్న చర్యలను “రాజకీయ కక్షసాధన”గా అభివర్ణించారు. తాను నిర్దోషినని, రాజకీయ ప్రతీకారంతో అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను అవమానించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. “నాకు చట్టంపై విశ్వాసం ఉంది, నిజం వెలుగులోకి వస్తుంది” అని జోగి రమేష్ పేర్కొన్నారు. ఇక ఈ అరెస్ట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవడాన్ని రాజకీయ పీడనంగా అభివర్ణిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870