हिन्दी | Epaper
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Telugu news: Janmabhoomi Express: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు

Tejaswini Y
Telugu news: Janmabhoomi Express: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు

South Central Railway update: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం విడుదల చేసింది. విశాఖపట్నం–లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Janmabhoomi Express) రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన టైమింగ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

Read also: ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

టైమింగ్స్ మార్పు…

రైల్వే తాజా నిర్ణయం మేరకు ట్రైన్ నెంబర్ 12806 (విశాఖపట్నం–లింగంపల్లి) రైలు విశాఖపట్నం నుంచి ఉదయం 6.20 గంటలకు బయల్దేరి, రాత్రి 7.15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. అదే విధంగా ట్రైన్ నెంబర్ 12805 (లింగంపల్లి–విశాఖపట్నం) రైలు లింగంపల్లి నుంచి ఉదయం 6.55 గంటలకు ప్రారంభమై, రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Janmabhoomi Express
Janmabhoomi Express timings changed(file photo)

ఆగే స్టేషన్లు…

ఈ రైలు ప్రయాణంలో అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగనుంది. విశాఖపట్నం నుంచి ప్రారంభమై దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవరం, సామల్‌కోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, నూజివీడు, విజయవాడ(Vijayawada), తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికుడ, మిర్యాలగూడ, నల్గొండ, రామన్నపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్ మీదుగా లింగంపల్లి వరకు ఈ ట్రైన్ ఆగుతుందని అధికారులు వివరించారు.

ప్రయాణికులు తమ టికెట్లు బుక్ చేసుకునే ముందు తాజా టైమింగ్స్‌ను గమనించాలని, అసౌకర్యాలు నివారించుకోవడానికి రైల్వే వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌లో వివరాలు చెక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870