हिन्दी | Epaper

Jagan Mohan Reddy: కొమ్మినేని బెయిల్ పై స్పందించిన వైఎస్ జగన్

Sharanya
Jagan Mohan Reddy: కొమ్మినేని బెయిల్ పై స్పందించిన వైఎస్ జగన్

అమరావతి (Amaravati) మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ తీర్పు నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన స్పందనను అధికారికంగా వెల్లడించారు. “సత్యమేవ జయతే” అంటూ ట్వీట్ చేసిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తీవ్రంగా దుయ్యబట్టారు.

Jagan Mohan Reddy: కొమ్మినేని బెయిల్ పై స్పందించిన వైఎస్ జగన్
Jagan Mohan Reddy: కొమ్మినేని బెయిల్ పై స్పందించిన వైఎస్ జగన్

చంద్రబాబు తీరుపై జగన్ ఆగ్రహం

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర

అమరావతి నిర్మాణంలో చోటు చేసుకున్న వేల కోట్ల అవినీతి, పాలన వైఫల్యాలు, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబుగారు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు.

రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం, ఆస్తుల ధ్వంసం

ఈ కేసును రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న చంద్రబాబు, తమ ముఠాలతో రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.

“యాంకర్‌కి వ్యాఖ్యలతో సంబంధమే లేదు”

చంద్రబాబుగారు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైసీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని గారికి విశ్లేషకుడి వ్యాఖ్యలతో ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు సత్యమేవ జయతే అంటూ జగన్ పేర్కొన్నారు. ఈ తీర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమ అరెస్టుల అంశం దేశం మొత్తం దృష్టికి వెళ్లిందని జగన్ వ్యాఖ్యానించారు.

Read also: AP EAPCET: ఈఏపీసెట్‌ లో 15 వేలకు పైగా విద్యార్థులకు ప్రకటించని ర్యాంకులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870