విజయవాడ : పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్న్షిప్లు (Internship) కల్పించడానికి, వాటి భద్రతకు సంబంధించి విశ్వవిద్యాలయాల నుంచి సాంకేతిక సహకారం తీసుకునేందుకు ఫ్యాక్టరీస్ విభాగం సోమవారం శ్రీ వెంకటేశ్వర, జెఎన్టీయూ-అనంతపురం విశ్వవిద్యాలయాలు, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. విజయవాడలోని కార్మిక శాఖ కమీషనర్ కార్యాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వీరు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రతిపాదనను ఆ శాఖ కార్యదర్శి శేషగిరిబాబు తీసుకొచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి విశ్వవిద్యాలయాలు సాంకేతిక మద్దతునిస్తాయి. రాష్ట్రంలోని 200 ప్రమాదకర పరిశ్రమల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల (Precautions) పై థర్పార్టీ ఇచ్చే నివేదికను వర్సిటీలు పరిశీలిస్తాయి. ఫ్యాక్టరీల్లో భద్రత అధికారులను నియమించుకోవాలనే నిబంధన ఉంది. ఇందుకోసం వర్సిటీలు పీజీ డిప్లొమా కోర్సులు తీసుకురవాడం లేదంటే కోర్సుల్లోనే అదనంగా సబ్జెక్టును చేర్చడం లేదా కిన్ని చాప్టర్లు ప్రవేశపెట్టడం చేస్తాయి. ఐటీఐ, డిప్లొమా, లాంటివి బీటెక్ ల్లో సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు వర్సిటీలు నోడల్ సెంటర్లుగా పనిచేస్తాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :