हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్ : హైకోర్టు కీలక ఆదేశాలు

sumalatha chinthakayala
ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్ : హైకోర్టు కీలక ఆదేశాలు

విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రి లో 33,686 వేల చీరలు మాయం అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీరల స్కామ్‌ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే నిర్ధారించారు. 2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో రూ.కోట్లలో అవినీతి జరిగిందని, రూ.1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగినట్లు గుర్తించారు.

ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్

ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు

అయితే చీరల అమ్మకాల బాధ్యతలు ఈవో, జూనియర్ అసిస్టెంట్ నిర్వహించారు. ఈ మేరకు గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో షోకాజ్ నోటీసులపై సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు పూర్తి ఎంక్వైరీ జరిగే వరకూ పెనాల్టీ గానీ, చర్యలుగాని తీసుకోవద్దని తీర్పు వెల్లడించింది.

హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు

కాగా చీరల స్కామ్ అభియోగంపై సుబ్రహ్మణ్యాన్ని గతంలో దేవాదాయ శాఖ పలుమార్లు విధుల నుంచి సస్పెన్షన్ వేటు వేసినా వైసీపీ నేతల తోడ్పాటుతో మళ్లీ విధుల్లో చేరారు. ఇక స్కామ్‌పై ప్రత్యేక కమిటీతో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఇంద్రకిలాద్రిపై ఈ కమిటీ విచారణ జరపనున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సుబ్రహ్మణ్యంకు స్వల్ప ఊరట లభించినట్లైంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870