ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి మహమ్మారి నుండి విముక్తి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ (Ganja, drugs) వినియోగం యథేచ్ఛగా పెరిగిందని విమర్శించిన ఆయన, ఇప్పుడు ఇకపై ఎవరైనా గంజాయి లేదా డ్రగ్స్ విక్రయించినా, కొన్నా తాట తీస్తానని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చెయ్యేరు సభలో మాట్లాడిన ఆయన యువత భవిష్యత్ను నాశనం చేసే ఈ మాదకద్రవ్యాలకు ఇక చోటు ఉండదన్నారు.
అవినీతి లేని పరిపాలనకు శ్రీకారం
పెన్న్షన్ల వంటి ప్రాథమిక హక్కులకూ లంచాలు తీసుకునే పరిస్థితి దారుణమని పేర్కొన్న చంద్రబాబు, ఇకపై ఎవరైనా అవినీతికి పాల్పడితే, ముఖ్యంగా సంక్షేమ పథకాలలో కఠినంగా శిక్షించబడతారు.. అవినీతి లేని శుభ్రమైన పరిపాలన విధానాన్ని స్థాపించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రజాసేవకులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రజల హక్కుల కోసం కఠిన నిర్ణయాలు
పేదల హక్కులను కాపాడేందుకు, యువతను తప్పుదోవ పట్టకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టంగా చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వ్యసనాలను సహించేది లేదని, రాష్ట్రాన్ని ఒక మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం పోలీసు విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు, అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు.
Read Also : Goshala : అత్యాధునిక సదుపాయాలతో గోశాలల నిర్మాణం – సీఎం రేవంత్