శ్రీకాళహస్తి రూరల్ : పురావస్తుశాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఏర్పేడు మండలం గుడిమల్లం (Gudimallam Temple) ఆలయం కుంభాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి 23వరకు కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నెల 7న బాలాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. గుడిమల్లం ఆలయం అతి పురాతనమైనది. 30 సంవత్సరాల ముందు శివరాత్రి సందర్భంగా అగ్నిప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగింది. దాంతో ఆలయంలో కుంభాభిషేకం జరపాల్సి ఉండగా ఏ కారణాల చేతనో నిర్వహించలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమించారు.
Read also: Siddipet: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

రూ.3 కోట్లతో రోడ్లు ఏర్పాటు
దేశంలో మొదటి శివాలయంగా గుర్తింపు పొందిన ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించుటకు చొరవ చూపారు. సాధారణంగా 12 సంవత్సరాలకొకమారు కుంబాభిషేకం జరగాలి. కానీ గుడిమల్లం ఆలయానికి ధర్మకర్తల మండలి లేకపోవటంతో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరిబాబునాయుడు ఇక్కడకు వచ్చే భక్తులకు. బస్సు సదుపాయం కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. గుడిమల్లం అభివృద్ధికి శాసనసభ్యుడు సుధీర్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. రూ.3 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి సంబంధించి కట్టడాలు ధ్వంసం కాకుండా మరమ్మత్తులు చేపట్టి మహాకుంభాభిషేకం జరుపుటకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరినాయుడు, పాలకమండలి సభ్యులు రాజకుమార్ నాయుడు, ఆరుణ, నిరంజన్, ఆలయ ఇఓ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. బాలాలయం సందర్భంగా 42 రోజుల పాటు అంతరాలయం ప్రవేశం ఉండదని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: