ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతిలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్స్ (MLA and MLC towers) లో వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.524 కోట్ల నిధులు విడుదల చేసింది. దీనికి పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఈ నిధులతో టవర్స్ లో ఆధునిక వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. రాజధాని నిర్మాణానికి ఇది మరొక మద్దతుగా నిలుస్తుంది.
ఏపీ స్పేస్ పాలసీ – కొత్త దిశగా రాష్ట్రం
ఇక మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక రంగంలో ముందడుగు వేసింది. రాష్ట్రానికి ప్రత్యేకమైన AP స్పేస్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీని వచ్చే 5 సంవత్సరాలపాటు అమల్లో ఉంచాలని నిర్ణయించింది. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ తయారీ, మరియు రాబోయే స్పేస్ టెక్నాలజీ కార్యక్రమాలకు ఇది మద్దతుగా నిలవనుంది. ప్రభుత్వ సూచనల మేరకు AP స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీ సత్యసాయి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటు
స్పేస్ రంగ అభివృద్ధికి అనుకూలంగా రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతాలను ఎంచుకున్నారు. శ్రీ సత్యసాయి మరియు తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఉద్యోగ అవకాశాలు, పరిశోధన, పరిశ్రమలకు దోహదపడుతుంది. ప్రభుత్వ ఈ ప్రణాళికలు రాష్ట్రాన్ని సాంకేతికంగా ముందున్న రాష్ట్రాల సరసన నిలబెడతాయని భావిస్తున్నారు.
Read Also ; Amaravathi : రాజధానిలో భూమిలేని పేదలకు పెన్షన్ పునరుద్ధరణ