Family Missing: శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. హెచ్.టి హళ్లి వడ్రహట్టి గ్రామానికి చెందిన ఒకే ఇంటికి చెందిన మహిళలు, పిల్లలు కనిపించకుండా పోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.
Read Also: AP Name Change Controversy: గరికపాటి వ్యాఖ్యలకు కమలానంద భారతి కౌంటర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేశ్ తన తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు రోహిణి, రచనలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన వీరేశ్ తరచూ ఇంట్లో గొడవ పడుతూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో గత నెల 27న కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. భర్త వేధింపులు భరించలేకపోయారో లేక మరేదైనా కారణమో కానీ, అదే రోజు రాత్రి తల్లి సుబ్బమ్మతో కలిసి లక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.
బంధువుల ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తు..
రెండు రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన బంధువులు ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రొళ్ల ఎస్సై గౌతమి.. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా, కుటుంబ సభ్యులు అదృశ్యమైనప్పటి నుంచి వీరేశ్ కూడా పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: