हिन्दी | Epaper

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

Sudheer
YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తి వైజాగ్ నగరంలోని వ్యాపార ల్యాండ్ అని సమాచారం.

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
ysrcp mp mvv

ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. హయగ్రీవ భూమిని వృద్ధుల మరియు అనాథల సేవల కోసం కేటాయించడం జరిగింది. కానీ ఎంవీవీ సత్యనారాయణ ఈ భూములను తన స్వలాభం కోసం ఉపయోగించారనీ, వాటిని చిన్న భాగాలుగా విభజించి, తప్పుడు పత్రాలతో ఇతరుల‌కు అమ్మకాలు చేశారని గుర్తించారు. ఈ కేసులో సత్యనారాయణపై ఇంకా మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఈడీ ఆలోచిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870