ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas)పై, శ్రీకాకుళం (Srikakulam) జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్లో ఆధికారికంగా కేసు నమోదైంది. ఆయనపై జనసేన పార్టీ స్థానిక నేత పంజరాపు సింహాచలం ఫిర్యాదు చేశారు.

టీవీ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చకు దారితన్నాయి.
అందులో ఆయన, “పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారు ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చారు, కానీ ఇప్పుడు నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడం మానేశారు.” అని పౌర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించినట్టు ఆరోపణ.
జనసేన నాయకుడి ఫిర్యాదు ఆధారంగా చర్య
దువ్వాడ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన నాయకుడు పంజరాపు సింహాచలం, హిరమండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, దువ్వాడపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులో పవన్ కల్యాణ్కు అవమానం కలిగేలా, తప్పుడు ఆరోపణలు చేశారు అని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసిన పోలీసులు
ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హిరమండలం పోలీసులు, నిన్న టెక్కలి సమీపంలోని దువ్వాడ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. తదుపరి విచారణ కోసం ఆయనను పిలవనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: