हिन्दी | Epaper

Devineni Uma: జగన్ దమ్ముంటే అమరావతిలో పర్యటించు: దేవినేని ఉమా

Sharanya
Devineni Uma: జగన్ దమ్ముంటే అమరావతిలో పర్యటించు: దేవినేని ఉమా

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) సవాల్ విసిరారు. “దమ్ముంటే అమరావతిలో పర్యటించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూసి ప్రజలకు నిజం చెప్పండి” అని ఆయన వ్యాఖ్యానించారు.

మీడియా సమావేశంలో వ్యాఖ్యలు

సోమవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని (Devineni Uma) ఉమ మాట్లాడుతూ, “అక్రమాలు చేసి జైలుయాత్రలు చేయడం మానేసి, ఒకసారి రాజధాని ప్రాంతానికి రండి” అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

Devineni Uma
Devineni Uma

“అమరావతి మునగలేదు” – దేవినేని ఉమ

అమరావతి లోని సీడ్ యాక్సెస్ రోడ్డు, సచివాలయం, వీఎస్‌ఆర్‌ఎం, విట్ యూనివర్సిటీ వంటి ప్రాంతాలను స్వయంగా వచ్చి చూడాలని జగన్‌ (Jagan) ను సవాల్ చేశారు. “అమరావతి ఎక్కడా మునిగిపోలేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆయన స్పష్టం చేశారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆరోపణలు

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి వస్తున్న విశేషమైన ఆదరణ చూసి, ఓర్చుకోలేక జగన్ అమరావతి (Amaravati) అభివృద్ధిపై విషప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు.

జగన్ మానసిక స్థితి ప్రశ్నార్థకమని వ్యాఖ్య

“జగన్ మానసిక పరిస్థితి ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోంది. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు” అని దేవినేని మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/anantapur-anantapur-urban-mla-daggubati/andhra-pradesh/531936/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870