हिन्दी | Epaper

Crime: తనను దూరం పెట్టిందన్న కోపంతో ముక్కు కోసిన ప్రియుడు

Saritha
Crime: తనను దూరం పెట్టిందన్న కోపంతో ముక్కు కోసిన ప్రియుడు

(Crime) పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్రేమోన్మాది ఘాతుకం వెలుగుచూసింది. ప్రేమించిన యువతి తనను కాదందని యువకులు ప్రాణం తీసుకోవడమో, లేదా ప్రియురాలి ప్రాణాలు తీయడమో చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. కానీ తాజా గా ఓ వ్యక్తి మాత్రం తనను దూరం పెట్టిందన్న కోపంతో ఏకంగా ప్రియురాలి ముక్కునే కోసేశాడు. 

Read Also: Amaravati farmers plots: అమరావతి రైతులకు శుభవార్త

Crime

మహిళపై ఘాతుకమైన దాడి

పిడుగురాళ్ల మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటుంది. భర్తతో విభేదించి దూరంగా ఉంటున్న మరియమ్మకు ఇద్దరూ పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా మరియమ్మ పిడుగురాళ్ల మున్సిపాలిటీలో పని చేసే వెంకట్రావుతో సహజీవనం చేసింది. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరూ మధ్య కూడా విబేధాలు రావడంతో వెంకట్రావుకు మరియమ్మ దూరంగా ఉంటుంది. వెంకట్రావును ఇంటికి రానీయకపోవడం, కనపడిన మాట్లాడకపోవడంతో మరియమ్మ పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మరియమ్మకు బుద్ది చెప్పాలనుకున్నాడు.

తన స్నేహితుడైన రాజశేఖర్‌తో కలిసి మరియమ్మ ఇంటికి వచ్చాడు. మరియమ్మ ఒక్కతే ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్ళారు. (Crime) ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కోడి కత్తితో మరియమ్మ ముక్కు కోశాడు. ఆ ముక్కను తనతో తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మరియమ్మ ను స్థానికులు పిడుగురాళ్ల ఆసుపత్రికి (Hospital) తరలించారు. అక్కడ నుండి నర్సరావుపేట ఆ తర్వాత గుంటూరు జిజిహెచ్ కు ఆమెను తీసుకెళ్లారు. ప్రస్తుతం జిజిహెచ్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870