నెల్లూరు : నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థిని బన్నెల గీతాంజలి (20) శుక్రవారం ఉదయం హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దసరా హాలిడేస్ అనంతరం గురువారం సాయంత్రం ఆమె మెడికల్ కాలేజీలోని హాస్టల్కు చేరుకుంది. ఎంబీబీఎస్(MBBS) మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్ ఉన్న నేపథ్యంలో గీతాంజలి గురువారమే హాస్టల్కి చేరుకుంది. నలుగురు విద్యార్థులు ఉండాల్సిన గదిలో తన తోటి విద్యార్థినితో పాటు ఇద్దరే ఉన్నారు. శుక్రవారం ఉదయం 9గంటలకు బ్రేక్ఫాస్ట్ పూర్తయి విద్యార్థులంతా ప్రాక్టికల్స్కి చేరుకున్నారు. గీతాంజలి కూడా అందరితో పాటు సంతోషంగా టిఫిన్ చేసింది.
Read Also: CM Chandrababu: 2026 జనవరి కల్లాపోలవరం ప్రాజెక్టు పూర్తి

గీతాంజలిని తన స్నేహితురాలు ప్రాక్టికల్స్కు(practicals) రమ్మని పిలువగా, తాను మళ్ళీ వస్తానంటూ గదిలోనే ఉండిపోయింది. కాసేపటి అనంతరం కేర్ టేకర్స్ హాస్టల్ గదుల్లో ఎవరైనా ఉన్నారేమోనని పరిశీలించగా గీతాంజలి తన హాస్టల్ రూమ్లో ఫ్యాన్కు వేసుకుని కనిపించింది. నాలుగవ పట్టణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కిందకి దించి పరిశీలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు గ్రహిం చారు. గీతాంజలి తల్లి దండ్రులకు సమాచారం అందించి ఆమె మృతికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. గీతాంజలికి అనారోగ్యంగా ఉండడంతో గురు వారం వైద్యం అందించి, కళాశాలకు పంపినట్లు ఆమె తల్లిదండ్రులు నుంచి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేని నేపథ్యంలో గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిందా మరేమైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏదీ ఏమైనా ఇంటి నుండి కళాశాలకు వచ్చిన రెండో రోజే గీతాంజలి మృతి చెందడంతో మెడికల్ కళాశాల హాస్టల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: