हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

Saritha
Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు (Chittoor) జిల్లా పర్యటన ఏర్పాట్లను, ప్రదేశాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, బుదవారం పరిశీలించారు.
ఈ నెల 24వ తేదీన చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొనడం తో పాటు ప్రజలతో బహిరంగ మీటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు చర్యలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కలిసి పరిశీలించారు.

Read Also: Kurnool: సిందనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

సిబ్బంది అప్రమత్తత

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విచ్చేయు ప్రదేశాలు, సభా ప్రాంగణం, రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ఎంట్రీ–ఎగ్జిట్ గేట్లు, బ్యారికేడింగ్, పోలీస్ పాయింట్లు, సభా వేదిక పరిసరాలు, ప్రజల రాకపోకల మార్గాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం ముందస్తుగా కేటాయించిన ప్రదేశాలలోనే పార్కింగ్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రద్దీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా రూట్ అంతా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.అలాగే, సభా ప్రాంగణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని, బ్యారికేడింగ్, మెటల్ డిటెక్టర్ చెకింగ్, ఫ్రిస్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్యూటీ పాయింట్ల వద్ద సిబ్బంది అప్రమత్తత వంటి అంశాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వీఐపీ రూట్, సభా ప్రాంగణ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు/వాహనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని పేర్కొన్నారు.

Collector inspects arrangements for Chandrababu Naidu's Chittoor district visit
Collector inspects arrangements for Chandrababu Naidu’s Chittoor district visit

“స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం , పబ్లిక్ మీటింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం, ఫైర్ సేఫ్టీ, తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రజలకు సూచనల కోసం సైన్‌బోర్డులు వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటన సందర్భంలో ప్రజలకు భద్రతతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించడానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందస్తుగా సమీక్షించి, బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా నిఘా తదితర వ్యవస్థలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారుల బృందం పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870